గుళ్లను కూల్చినోడికి ఇంతకు మించిన ఆలోచనలెలా వస్తాయి?
3 Feb, 2021 11:05 IST
వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి
విశాఖ: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడి కుట్రలను వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ఎండగట్టారు. పంచాయతీ ఎన్నికలు పెట్టాల్సిందేనని రంకెలేసిన చంద్రబాబు ఇప్పుడు అభ్యర్థులు దొరక్క కళ్లు తేలేస్తున్నాడు. ఈ పరాభవం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు తన పార్టీ నాయకుల మీద తనే దాడులు చేయించే కుట్రలు మొదలుపెట్టాడు. గుళ్లను కూల్చినోడికి ఇంతకు మించిన ఆలోచనలెలా వస్తాయి? అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
ప్రేమ, నిజాయితీ, పవిత్రత...భయం కన్నా గొప్పవి...ఇవి నీలో ఉంటే నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం ఉండదు.. ఏ శక్తికి నిన్ను ఆపగలిగే సామర్ధ్యం ఉండదని ఉదయం చేసిన ట్వీట్లో విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.