తాడేపల్లి: ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా వ్యంగ్యస్త్రాలు సంధించారు. రాజధాని విషయంలో చంద్రబాబు నవ్వుతున్నాడో.. మొహం కంద గడ్డలా పెట్టుకున్నాడో.. కుట్రపూరిత ఆలోచనలో ఉన్నాడో..లేదా ఏడుస్తున్నాడో.. తెలుసుకోవాలంటే మనం ఆయన మొహం చూడనక్కర్లేదు. ఎల్లో మీడియాలో వార్తలు, వ్యాఖ్యలు చూస్తే సరిపోతుందని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.