అమరావతి: 14 నెలల పాటు పాకిస్థాన్ చెరలో ఉండి, సీఎం వైయస్ జగన్ చొరవతో ఇటీవల విడుదలైన ఆంధ్రప్రదేశ్ కు చెందిన మత్స్యకారులు సంబరాలు చేసుకుంటున్నారని వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. అయితే, వారి సంతోషాన్ని చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని ఆయన విమర్శించారు.
‘పాకిస్థాన్ చెరలో 14 నెలల పాటు నరకాన్ని అనుభవించిన మత్స్యకారులు సీఎం జగన్ గారి చొరవతో విడుదలయ్యారు. సొంత ఊళ్లకు చేరి సంబరాలు జరుపుకుంటుంటే చంద్రబాబునాయుడు కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు. సీఎం వైయస్ జగన్ కు ఎక్కడ మంచి పేరు వస్తుందో అని దాడులు, అరాచకాలు మొదలు పెట్టారు’ అని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.