న్యూఢిల్లీ: పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఎస్పీజీ సవరణ బిల్లుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. ఈ మేరకు మంగళవారం బిల్లుపై జరిగిన చర్చలో ఎంపీ విజయసాయిరెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎస్పీజీ భద్రత స్టేటస్ సింబల్ కాదన్నారు.వ్యక్తులకు ఉన్న ముప్పును ఆధారంగా చేసుకొని ఎస్పీజీ భద్రత కల్పించాలన్నారు. కేవలం ఒక కుటుంబంలో జన్మించిన కారణంగా ఎస్పీజీ భద్రత ఇవ్వాలనేది సమంజసం కాదన్నారు.
Read Also: పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి