పిల్లల చదువు బాధ్యత నాదే అన్న ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్
1 Sep, 2022 11:58 IST

సత్యసాయి జిల్లా: పిల్లల చదువు బాధ్యత నాదే అన్న ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమే అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తెలిపారు. సత్యసాయి జిల్లా గోరంట్లలో బెస్ట్ ఇన్నోవేషన్ ప్రైవేట్ వర్సిటీ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా ఎంపీ విజయసాయిరెడ్డి పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో సీఎం వైయస్ జగన్ మోహన్రెడ్డి విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. నవరత్నాలతో ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని తెలిపారు.