అమరావతి: టీడీపీ ఉపాధ్యక్షుడు నారా లోకేష్పై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. పప్పు, మాలోకం అంటూ సోషల్ మీడియా ఎందుకు కితకితలు పెడుతుందో అర్థమైందిగా..చంద్రబాబు ఇల్లు మునగాలని(కొట్టుకొచ్చిన) పడవను బ్యారేజి గేట్లకు అడ్డం పెట్టామట. 70 గేట్లు తెరిచినా నీరు వెనక్కి తన్నుతుంటే అందులో కుట్ర యాంగిల్ కనిపించింది. మామూలు బ్రెయిన్ కాదు మాలోకానిది అంటూ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.