న్యూఢిల్లీ: గ్లోబల్ బిజినెస్ సమ్మిట్- 2020 కు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి హాజరవుతున్నారు. ఈ రోజు నిర్వహించే గ్లోబల్ సమ్మిట్లో బిల్ గేట్స్ తో కలిసి ప్రపంచ వ్యాపార వేదికపై తమ ప్రణాళికాబద్ధమైన ఆలోచనలు, అవకాశాలపై ఇండియన్ కామర్స్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్ మెన్ విజయసాయి రెడ్డి చర్చించనున్నారు. ఈ వేదికపై తెలుగువారైన విజయ సాయి రెడ్డి గారిని చూడటం గర్వకారణమని రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.