రాజ్యసభ పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ సభ్యుడిగా ఎంపీ విజయసాయిరెడ్డి
29 Mar, 2023 10:32 IST

న్యూఢిల్లీ: రాజ్యసభ పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి చోటు దక్కించుకున్నారు. రాజ్యసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ ఎన్నిక మంగళవారం జరిగింది. ఈ ఏడాది మే 1వ తేదీ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 30వ తేదీ వరకు ఉండే పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీలో వైయస్ఆర్ సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి చోటు దక్కించుకున్నారు.