సీఎం వైయస్ జగన్ను కలిసిన ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి
10 Mar, 2021 17:10 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డిని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన ఎంపీ సుబ్రహ్మణ్యస్వామిని సీఎం వైయస్ జగన్ సాదరంగా ఆహ్వానించి.. శాలువాతో సత్కరించి.. జ్ఞాపికను అందజేశారు. అనంతరం ఇరువురు పలు అంశాలపై చర్చించారు.