అన్యాయాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత బీజేపీదే
9 Feb, 2022 14:40 IST
న్యూఢిల్లీ: ఏపీ విభజన అడ్డగోలుగా చేశారు కాబట్టే కాంగ్రెస్ను ప్రజలు సమాధి చేశారని, అన్యాయాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత బీజేపీపైనే ఉందని వైయస్ఆర్సీపీ ఎంపీ మిథున్రెడ్డి అన్నారు. విభజన చట్టంలో హామీలన్నీ తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండు చేశారు. లోక్సభలో ఎంపీ మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం హామీలు నిలబెట్టుకోవాలని కోరారు. రాష్ట్రానికి అన్యాయం జరిగిందని తాము మొదటి నుంచి చెబుతున్న విషయాన్ని ప్రధాని ఇప్పుడు చెప్పారని గుర్తు చేశారు. టీడీపీ రాష్ట్రాభివృద్ధి వదిలేసి పనికిమాలిన ఫిర్యాదులు చేస్తోందని.. రాష్ట్రాభివృద్ధిని టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.