పశ్చిమగోదావరి: రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ఆర్సీపీలోకి వలసల జోరు కొనసాగుతోంది.వైయస్ జగన్మోహన్ రెడ్డి సమర్థ నాయకత్వం, సిద్ధాంతాలు,ఆశయాల పట్ల ఆకర్షితులై వైయస్ఆర్సీపీలోకి చేరుతున్నారు. ఏలూరు వైయస్ఆర్సీపీ కార్యాలయంలో ఆళ్ల నాని సమక్షంలో 100 మంది యువకులు పార్టీలోకి చేరారు. వారికి ఆళ్ల నాని పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్టాడుతూ ఏపీకి ప్రత్యేకహోదా వైయస్ జగన్తోనే సాధ్యమన్నారు. ప్రత్యేకహోదా కోసం మొదటి నుంచి పోరాడే ఏకైక పార్టీ వైయస్ఆర్సీపీ అని అన్నారు. హోదాతోనే యువతకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయన్నారు.