తూర్పు గోదావరి: వైయస్ఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహన్ అకాల మరణం పార్టీకి తీరని లోటని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఇటీవల అనారోగ్యంతో ఆకస్మికంగా దివంగతులైన వైయస్ఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శి మిండుగుదిటి మోహన్ సంతాప సభ శనివారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైవీ సుబ్బారెడ్డి , మంత్రులు విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీలు మార్గని భరత్, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.