పాలనా వైఫల్యాన్ని ప్రశ్నిస్తే తప్పుడు కేసులా?

17 May, 2025 16:03 IST

నెల్లూరు: పాలనా వైఫల్యాన్ని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడ‌తారా అని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి మండిపడ్డారు. హామీల అమలును గాలికొదిలేసిన సీఎం చంద్రబాబు నాయుడు.. మద్యాన్ని మాత్రం ఏరులై పారిస్తున్నారని విమ‌ర్శించారు. నెల్లూరులో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..  ‘పాలనా వైఫల్యాన్ని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారు.  ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిల అరెస్ట్‌ దుర్మార్గం. గత ప్రభుత్వంలో పారదర్శకంగా జరిగిన మద్యం విషయాన్ని లిక్కర్ స్కాంగా మార్చారు. జరగని లిక్కర్‌ స్కామ్‌ని జరిగినట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ నేతలని ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతో ఈ కేసులో నేతలతో పాటు సీనియర్ అధికారులకు ఇరికించారు.చంద్రబాబు తగిన  మూల్యం చెల్లించుకోక తప్పదు’ అని చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి హెచ్చ‌రించారు.