ఏలూరు: సీఎం వైయస్ జగన్ పాలనలో రైతులు చాలా సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు తెలిపారు. రైతు బాగుంటే రాజ్యం బాగుంటుందని నమ్మిన వ్యక్తి వైయస్ జగన్ అన్నారు. రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుకు కావాల్సిన విత్తనాలు నుంచి అమ్మకాల వరకు అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోందన్నారు.