నంద్యాలలో మా సత్తా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు

4 Feb, 2023 13:07 IST

నంద్యాల: నంద్యాలలో మా సత్తా నిరూపించుకోవాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి అన్నారు. ఉప ఎన్నిక, 2019 ఎన్నికల్లో మా సత్తా చూపించామన్నారు. నంద్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేకే టీడీపీ డ్రామాలాడుతుందని మండిపడ్డారు. తప్పుడు ఆరోపణలతో పబ్బం గడుపుకుంటున్నారు. టీడీపీ నేతలవి దిగజారుడు రాజకీయాలని ఫైర్‌ అయ్యారు.  నంద్యాల అభివృద్ధి కోసమే సీఎం వైయస్‌ జగన్‌ ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేశారని చెప్పారు. నంద్యాలలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటుపై కోర్టుకెళ్లిన మీరా నీతులు చెప్పేదని టీడీపీ నేతలను ఎమ్మెల్యే నిలదీశారు.