తాడేపల్లి: డ్వాక్రా అక్క చెల్లమ్మలకు ఇవాళ పండగ రోజని, సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం వైయస్ఆర్ ఆసరా ద్వారా హామీ నిలబెట్టుకున్నారని ఎమ్మెల్యే ఆర్కే రోజా పేర్కొన్నారు. మహిళలు కోసం దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి రెండు అడుగులు వేస్తే సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి నాలుగు అడుగులు ముందుకు వేస్తున్నారని చెప్పారు. 90 లక్షల మందికి వైయస్సార్ ఆసరా ద్వారా మేలు జరిగిందని చెప్పారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు.
సీఎంకు మహిళలు రుణపడి ఉంటారు..
మహిళలు, విద్యార్థులు కోసం సీఎం జగన్ అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశ పెట్టారని రోజా పేర్కొన్నారు. ఆడవారికి అండగా ఉంటున్న ముఖ్యమంత్రికి మహిళలు అందరూ రుణపడి ఉంటారు. మహిళలకు ఇచ్చే ఇళ్ల పట్టాలను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. రుణమాఫీ చేస్తామని చెప్పి చంద్రబాబు మహిళలను మోసం చేశారు. ప్రజలను తమ సొంత కుటంబ సభ్యులుగా జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. దళిత మహిళను హోమ్ మంత్రి, ఎస్టీ మహిళను డిప్యూటీ సీఎం చేసిన ఘనత జగనన్నకు దక్కుతుంది. నామినేటెడ్ పనులు, పదవుల్లో 50 శాతం మహిళలకు అవకాశం కల్పించారు. స్త్రీల ఆకాంక్ష మేరకు మద్యపాన నిషేధాన్ని దశల వారిగా అమలు చేస్తున్నారు. మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తయారు చేస్తున్నారు. ఆడవారి కోసం చంద్రబాబు ఒక మంచి పథకం కూడా ప్రవేశ పెట్టలేదు. వైఎస్సార్ ఆసరా మీద చంద్రబాబు నిందలు వేస్తున్నారు. కులాలు ,మతాలకు అతీతంగా సీఎం వైయస్ జగన్ సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తున్నారని రోజా ప్రశంసించారు.
నాడు సీబీఐ రాష్ట్రానికి రావద్దని జీవో ఇచ్చి..
అంతర్వేదిలో రథం తగలబడిన సంఘటనలో చంద్రబాబు ప్రవేయం ఉంది. గతంలో రైలు దహనం, రాజధాని భూములు తగలబెట్టించిన ఘనత చంద్రబాబుది. సీబీఐ రాష్ట్రానికి రావద్దని జీవో ఇచ్చిన చంద్రబాబు నేడు సీబీఐ విచారణ కోరుతున్నారు. మా చిత్తశుద్ధి నిరూపించుకునేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సీబీఐ విచారణకు ఆదేశించారు అన్నారు నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా. అనంతరం ఆమె వైయస్సార్ ఆసరా పథకం గురించి మాట్లాడారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్పప్పటికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. చంద్రబాబులాగా కుంటి సాకులు చెప్పడం జగనన్నకు తెలియదని రోజా పేర్కొన్నారు.