సీఎం వైయస్ జగన్ చరిత్రలో నిలుస్తారు
31 Dec, 2019 15:12 IST
అమరావతి: మాట ఇస్తే మడమ తిప్పని నేతగా సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి చరిత్రలో నిలుస్తారని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి పేర్కొన్నారు. ఆరు నెలల్లోనే మాట నిలబెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్ అన్నారు. రేపటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ కార్మికులు మారుతారని పేర్కొన్నారు. ఆర్టీసీ వ్యవస్థను చంద్రబాబు నిర్వీర్యం చేశారని, గత ఐదేళ్లలో అవినీతి పరాకాష్టగా పాలన సాగిందని విమర్శించారు.