బీసీ వర్గానికి చెందిన స్పీకర్ను టీడీపీ సభ్యులు అవమానిస్తారా?
22 Jan, 2020 11:16 IST
అసెంబ్లీ: బీసీ వర్గానికి చెందిన స్పీకర్ను టీడీపీ సభ్యులు అవమానిస్తారా? అంటూ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మండిపడ్డారు. టీడీపీ సభ్యుల తీరును ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ల ఆస్తులు కాపాడుకోవడం తప్ప..ప్రజా సమస్యలపై వారికి చిత్తశుద్ధి లేదు. స్పీకర్ పోడియం వద్ద ఆందోళన చేస్తున్నారు. మార్సల్స్పై దాడి చేస్తున్నారు. సీనియర్ సభ్యుడైన బుచ్చయ్య చౌదరి చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తున్నాడు. మాది ప్రజా సంక్షేమ ప్రభుత్వం. వైయస్ జగన్ పరిపాలనను చూసి ఓర్వలేక చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు.