తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును ప్రభుత్వం నియమించింది. కేబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల పాటు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా మల్లాది విష్ణు తన సేవలను అందించనున్నారు.