ఏపీ అభివృద్ధికి వైయస్ జగన్ పునాది
23 Mar, 2023 13:01 IST
అమరావతి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి పునాది వేస్తున్నారని ఎమ్మెల్యే కిలారి రోశయ్య అన్నారు. రైతులకు గ్రామీణ స్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రతిపంటకు గిట్టుబాటు ధర లభిస్తోందన్నారు. మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు అండగా నిలిచేలా సీఎం జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. పంటనష్టం జరిగితే సీజన్ ముగిసేలోపే పరిహారం అందజేస్తున్నామన్నారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా వైయస్ఆర్ ఉచిత పంటల బీమా అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.