విశాఖ: చంద్రబాబు మూడు గ్రామాలకే హీరో అని మిగతా 13 జిల్లాలకు విలన్గా మారారని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. మూడు గ్రామాల రైతుల సమస్యను చంద్రబాబు జాతీయ సమస్యగా చిత్రీకరించారన్నారు. మండలిలో ఏదో విజయం సాధించినట్లు చంద్రబాబు హీరోగా ఫీలవుతున్నారు. ఆయన 13 జిల్లాలకు విలన్గా మిగిలిపోతారన్న విషయాన్ని గమనించాలి.
కొబ్బరి చిప్పలు అమ్ముకునే బుద్దా వెంకన్నను మండలిలో కూర్చోబెట్టారు. తాను మేధావినంటూ వరుసగా ఓడిపోయిన యనమలను ఎమ్మెల్సీని చేశారు. స్పీకర్గా యనమల చేసిన కుట్రలు పైనున్న ఎన్టీఆర్కు తెలుసు. ఆయన సెల్ఫ్ సర్టిఫికెట్ మేధావి. రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్కు సభలో మైక్ ఇవ్వని మీరా రూల్స్ గురించి మాట్లాడేది. దీపక్రెడ్డి అనే అనే ఆర్థిక నేరస్తుడు.. ఈరకమైన వ్యక్తులను తీసుకొని వచ్చి శాసన మండలిలో కూర్చోబెట్టారు.
పవన్కు లాంగ్ మార్చ్ కాదు..రాంగ్ మార్చ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ది లాంగ్ మార్చ్ కాదు..రాంగ్ మార్చని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. గాజువాక ప్రజలు పవన్ను ఓడించారని, అందుకే విశాఖకు రాజధాని రాకుండా అడ్డుపడుతున్నారు. పవన్కు స్థిరత్వం, సిద్ధాంతాలు లేవని, ఐదేళ్లలో ఆరు పార్టీలు మారిన నేత పవన్ తప్ప మరెవ్వరూ లేరు.