అమరావతి: ప్రభుత్వంపై టీడీపీ సభ్యులు అసత్య ప్రచారం చేస్తున్నారని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. వైయస్ఆర్ చేయూత కార్యక్రమాన్ని విశాఖ జిల్లాలో సెప్టెంబర్3, 2018న వైయస్ జగన్ పాదయాత్రలో ప్రకటించినట్లు గుర్తు చేశారు. మేనిఫెస్టోలో వైయస్ఆర్ చేయూతపై స్పష్టంగా చెప్పామన్నారు. మా మేనిఫెస్టో చూసి ప్రజలు ఓట్లు వేశారని, మాకు అధికారాన్ని ఇచ్చారని తెలిపారు. తప్పుడు ప్రచారం మానుకోవాలని హితవు పలికారు.