చంద్రబాబు ప్రభుత్వం ఏడాదిలోనే విఫలం
ఒంగోలు: చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏడాదికాలంలోనే అన్ని విధాలుగా వైఫల్యం చెందిందని వైయస్ఆర్సీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి మండిపడ్డారు. జూన్ 4 న వైయస్ఆర్సీపీ తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమం పోస్టర్ను శనివారం ఒంగోల్లోని పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రులు ఆదిమూలపు సురేష్ ,మేరుగ నాగార్జున, నాయకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి , రాష్ట్ర కార్యదర్శి కెవి రమణారెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే బూచేపల్లి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. `ఎన్నికల సమయంలో అబద్ధపు హామీలు ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలో కి వచ్చిన తరువాత వాటిని గాలికి వదిలేశారు. మహిళలు, రైతులు, విద్యార్థులు..ఇలా అన్ని వర్గాలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. అందుకే జూన్ 4 న వెన్నుపోటు దినం గా పరిగణిస్తూ పార్టీ అధినేత వైయస్ జగన్ పిలుపుమేరకు జిల్లాలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలి` అని శివప్రసాద్రెడ్డి కోరారు.