అమరావతి: ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారి సతీమణి భారతమ్మ గారు ఏదో లెటర్ రాశారని, సోషల్ మీడియా- వాట్సాప్ గ్రూపుల లో సర్క్యులేట్ అవుతుంది. సర్క్యులేట్ అవుతున్న లెటర్ భారతమ్మ గారు రాసింది కాదు. ఆ ఉత్తరం నకిలీది..." అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పష్టం చేశారు. భారతమ్మ గారు ఏ లెటర్ రాయలేదు అని, ఎవరో కావాలని అలాంటి ఉత్తరాలు సర్క్యులేట్ చేస్తున్నారని, అటువంటి తప్పుడు ప్రచారాలను ఎవరూ నమ్మవద్దు అని అన్నారు. భారతమ్మ గారికి అటువంటి లెటర్ రాయాల్సిన అవసరం కూడా లేదు అని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.