పన్నుల వసూళ్లు వేగవంతం చేయాలి
ఏలూరు: ప్రభుత్వం ఆర్థికంగా బలపడేందుకు పన్నుల వసూలుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి సంబంధిత అధికారులను ఆదేశించారు. పన్నుల వసూళ్లను వేగవంతం చేసి ఆదాయ వనరులను పెంపొందించేలా చర్యలు చేపట్టాలని కోరారు. వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో మంత్రి నారాయణస్వామి, వైద్య ఆరోగ్య శాఖమంత్రి ఆళ్లనాని సంబంధిత శాఖ అధికారులతో ఏలూరు డివిజన్ ఆదాయ వనరులపై సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పన్నుల చెల్లింపులో జాప్యం వహిస్తున్న వారిని గుర్తించి రాబట్టేందుకు కృషి చేయాలన్నారు. పాత బకాయిలు రాబట్టేందుకు మార్గాలను అన్వేషించాలని సూచించారు. ఏలూరు డివిజన్ పరిధిలోని 9 సర్కిల్ కార్యాలయాలలో ఆకివీడు, భీమవరం, ఏలూరు, జంగారెడ్డిగూడెం, నిడదవోలు, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు–1, తణుకు–2లలో భీమవరం సర్కిల్లో పన్నుల వసూళ్లు అధికంగా ఉన్నాయని చెప్పారు. జిల్లాలో నిర్మాణం, కేబుల్ నెట్వర్క్, ఆటోమొబైల్స్, కెమికల్స్, ఎరువులు, పురుగుమందులు, సిరామిక్, టైల్స్తో పాటు ఇతర ఆదాయ రంగాల నుంచి వసూలు అయిన మొత్తం ఎంత, ఇంకా ఎంతవసూలు కావాలి, గత మూడు నెలల రాబడి ఎంత..? తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. సమీక్షలో చింతలపూడి ఎమ్మెల్యే వీఆర్ ఎలీజా, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పాల్గొన్నారు.