నెల్లూరు జిల్లా రైతుల కల త్వరలో సాకారం
నెల్లూరు: నెల్లూరు జిల్లా రైతుల కలను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సాకారం చేయబోతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి అన్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబుతో కలిసి పెన్నా, సంగం బ్యారేజీ పనులను మంత్రి కాకాణి పరిశీలించారు. బ్యారేజీ నిర్మాణ పనులకు సంబంధించి ఇంజినీరింగ్ అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. పెన్నా, సంగం బ్యారేజీలను త్వరలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభిస్తారని, వరద కష్టాల నివారణకు కుడా ఈ బ్యారేజీలు దోహద పడతాయని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పెన్నా, సంగం బ్యారేజీ పనులు 90 శాతం పైనే పూర్తయ్యాయని మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి తెలిపారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి బ్యారేజీలకు శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. టీడీపీ హయాంలో పనులు నత్తనడకన సాగాయని.. చంద్రబాబు అసలు పట్టించుకోలేదని మండిపడ్డారు. వైయస్ జగన్ అధికారం చేపట్టిన తర్వాత పనులు వేగవంతం అయ్యాయన్నారు.