వేద పాఠశాల విద్యార్థుల మృతదేహాలను పరిశీలించిన మంత్రి
11 Dec, 2021 12:24 IST
విజయవాడ: కృష్ణా నదిలో మునిగి మృతి చెందిన అచ్చంపేట మండలం మాదిపాడు వేద పాఠశాలకు చెందిన 5 మంది విద్యార్థుల మృత దేహాలను గుంటూరు జి. జి. హెచ్ లో మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ , సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు , ఎమ్మెల్సీ లేళ్ళ అప్పి రెడ్డి , గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా, గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు పరిశీలించారు. భౌతికకాయాలను నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.