బద్వేలులో బీజేపీకి డిపాజిట్‌ కూడా రాదు

24 Oct, 2021 17:40 IST

 వైయ‌స్ఆర్ జిల్లా: బద్వేలు ఉప ఎన్నిక‌లో బీజేపీకి డిపాజిట్‌ కూడా రాదని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. బద్వేలు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం వైయ‌స్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్‌ దాసరి సుధా తరపున మంత్రి ప్రచారం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీకి ప్రజలని ఓట్లు అడిగే  అర్హత లేదని అన్నారు. తమ ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించిందని అన్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దాసరి సుధని భారీ మెజార్టీతో గెలిపించాని ప్రజలను కోరారు.