విజయవాడ: విజయవాడ నగర అభివృద్ధికి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి రూ.600 కోట్ల ప్రత్యేక నిధులు కేటాయించారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం విజయవాడలోని 39వ వార్డులో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విస్తృతంగా పర్యటించారు. స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇంటి పన్నుల విషయంలో విజయవాడ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.చంద్రబాబు, పవన్ కళ్యాణ్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పారు.