నిష్పక్షపాతంగా జగనన్న సంక్షేమ పథకాల అమలు
23 Jun, 2022 15:15 IST
అనంతపురం: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిష్పక్షపాతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని మంత్రి ఉషాశ్రీ చరణ్ తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో కులం, మతం, ప్రాంతం, పార్టీలు ఇవేవి చూడటం లేదన్నారు. గురువారం బ్రహ్మసముద్రం మండల పరిధిలోని బైరవానితిప్ప, కపటనింగంపల్లి గ్రామాలలో "గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లిన మంత్రి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ఆ కుటుంబం పొందిన లబ్ధిని తెలియజేస్తున్నారు. ప్రజల సమస్యలు వింటూ వాటిని తక్షణమే పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నారు. అనంతరం గ్రామ సచివాలయం, అంగన్ వాడీ సెంటర్ ను మంత్రి తనిఖీ చేశారు.