ట్రిపుల్ ఐటీ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఫలితాలు విడుదల
విజయవాడ: ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్షా ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే టాప్ టెన్ ర్యాంకుల్లో నిలిచారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఏపీ ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష – 2020 ఫలితాలను మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. దాచేపల్లి ఏపీ మోడల్ స్కూల్కు చెందిన వంశీకృష్ణ టాప్ర్యాంకర్గా నిలిచారన్నారు. పదో తరగతి పరీక్షలు లేని నేపథ్యంలో టెన్త్ సిలబస్ ఆధారంగానే ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించినట్లు చెప్పారు. పరీక్షకు 85,755 మంది విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. జనవరి 4వ తేదీ నుంచి కౌన్సిలింగ్ ఉంటుందని, ఇంటర్ అడ్మిషన్ కోసం ఆన్లైన్ ప్రాసెస్ ఏర్పాటు చేశామన్నారు. విద్య వ్యాపారం కాకూడదనే ఆన్లైన్ విధానం తెచ్చామని తెలిపిన మంత్రి.. మౌలిక వసతులు లేని కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.