దేశంలోనే వైయస్ జగన్ బెస్ట్ ముఖ్యమంత్రి
6 Sep, 2019 12:01 IST
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి దేశంలోనే బెస్ట్ సీఎం అని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు. వైయస్ జగన్ నేటితో 100 రోజుల పాలనను విజయవంతంగా పూర్తిచేసుకున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ కు పుష్పశ్రీవాణి శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోనే బెస్ట్ ముఖ్యమంత్రిగా నిలిచిన వైయస్ జగన్.. 100 రోజుల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకున్నారని ఆమె ప్రశంసించారు. పరిపాలన విషయంలో దేశం మొత్తం వైయస్ జగన్ అడుగుజాడల్లో నడుస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు పుష్ప శ్రీవాణి ట్వీట్ చేశారు.