చిత్తూరు : మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు నియోజకవర్గంలో చేపట్టిన పల్లెబాట కార్యక్రమం రెండో రోజు బుధవారం పుంగనూరు మండలంలో కొనసాగుతోంది. ప్రజా సమస్యల తక్షణ పరిష్కార దిశగా, గ్రామ,మండల స్థాయిలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలిస్తూ పుంగనూరు మండలంలోని గ్రామాలల్లో మంత్రి వర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటిస్తున్నారు. ఆయన వెంట చిత్తూరు జడ్పిచైర్మన్ జి.శ్రీనివాసులు(వాసు), స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.