కుప్పంలో సైతం వైయస్ఆర్సీపీ గెలిచి తీరుతుంది
11 May, 2024 17:02 IST
చిత్తూరు: కుప్పంలో సైతం వైయస్ఆర్సీపీ గెలిచి తీరుతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అవినీతి సామ్రాట్ చంద్రబాబు అంటూ మంత్రి పెద్దిరెడ్డి మండిపడ్డారు. శనివారం మంత్రి మీడియాతో మాట్లాడారు.
మంత్రి పెద్దిరెడ్డి ఏమన్నారంటే..
- అవినీతి సామ్రాట్ చంద్రబాబు
- నారావారిపల్లెలో రెండు ఎకరాల భూమి బాబుకి ఉంది
- ఇప్పుడు లక్షల కోట్లు సంపాదించారు
- ఈ డబ్బు ఎలా వచ్చింది
- ఇది అవినీతి కాదా?.
- సీఎం వైఎస్ జగన్, నాపై తరచూ చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు
- చంద్రబాబు లాగా మేము అవినీతి చేయలేదు.
- పుంగనూరు, అంగళ్లు ఘటనలకు సూత్రధారి చంద్రబాబ
- టీడీపీ నేతలు రెచ్చిపోయి దాడులు చేశారు
- పోలీసులను తీవ్రంగా కొట్టారు
- టీడీపీ నేతలు గుండాల వ్యవహరించారు
- దాడులు చేయించింది చంద్రబాబు.. కానీ నిందలు మాపై మోపారు
- ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు ఘోర ఓటమి తప్పదు.