టీడీపీ ప్రభుత్వం  యువతను మోసగించింది

15 Jul, 2019 15:10 IST

అమరావతిః కేవలం ఎన్నికల ముందే టీడీపీ సర్కార్‌ నిరుద్యోగ భృతి ప్రకటించారని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. గ్రామ వాలంటీర్లు,సచివాలయాలతో వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పిస్తుందన్నారు. గత ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందని ప్రశ్నించారు. కేవలం వెయ్యి రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని తెలిపారు.నిరుద్యోగ భృతి పేరుతో యువతను మోసం చేశారని తెలిపారు.