చంద్రబాబూ.. నీ కుయుక్తులు ఇక సాగవు
26 May, 2022 15:44 IST
శ్రీకాకుళం: చంద్రబాబూ.. నీ కుయుక్తులు ఇక సాగవని ‘సామాజిక న్యాయ భేరి’లో మంత్రి మేరుగ నాగార్జున హెచ్చరించారు. ఇవాళ శ్రీకాకుళం నుంచి ప్రారంభమైన సామాజిక న్యాయ భేరి సభలో మంత్రి మాట్లాడారు. సీఎం వైయస్ జగన్ గారి నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను ఎవరూ దూరం చేయలేరు. అన్ని వర్గాలు జగన్ గారికి అండగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు.