వైయస్ జగన్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు
14 May, 2022 10:55 IST
నెల్లూరు: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, "గడప గడపకు - మన ప్రభుత్వం" కార్యక్రమంలో భాగంగా వెంకటాచలం పంచాయతీలో ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం ద్వారా అందుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రజలకు వివరించారు. సీఎం వైయస్ జగన్ పాలనలో కులాలు, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు.