గుంటూరు: మంత్రి జోగి రమేష్కు తృటిలో ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు సడన్ బ్రేక్ వేయడంతో కాన్వాయ్లో ఒకదానికొకటి ఢీకొన్నాయి. మంత్రి జోగి రమేష్ చిలకలూరిపేట నుంచి నెల్లూరు ప్రయాణం చేస్తుండగా నేషనల్ హైవే 16 పెళ్లూరు వద్ద కాన్వాయ్ జాతీయ రహదారి వారు ఏర్పాటు చేసిన దారి మళ్లింపు బార్ గేట్స్ వద్ద ముందు కారు బ్రేక్ వేయడంతో ఒకదానితో ఒకటి మూడు కార్లు పక్కనే ఉన్న డివైడర్ ను ఢీ కొట్టాయి. కాన్వాయ్ లో ఉన్న మంత్రికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. హుటాహుటిన వేరే వెహికల్స్ లో అక్కడి నుంచి వెళ్లిపోయారు.