విజయవాడ: రాష్ట్రంలో త్వరలోనే నూతన ఐటీ పాలసీ అమలు చేస్తున్నట్లు మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తెలిపారు. నాణ్యమైన ఉద్యోగాలు, దీర్ఘకాలిక పెట్టుబడులే లక్ష్యంగా ఐటీ పాలసీ తెస్తామని చెప్పారు. విశాఖలో ఐటీని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఆదాని డేటా సెంటర్ ద్వారా రూ.14 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్పారు. ఐటీ రంగంలోని ప్రముఖ సంస్థలను విశాఖకు తీసుకువస్తామని పేర్కొన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ను ప్రోత్సహిస్తామని తెలిపారు.