ఏపీలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో పెట్టుబడులకు అపార అవకాశాలు
23 Mar, 2021 12:00 IST
అమరావతి: ఏపీలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలోకి పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని మంత్రి మేకపాటి గౌతంరెడ్డి పేర్కొన్నారు. వైద్య పరికరాల తయారీలో జర్మనీ పెట్టుబడులకు అవకాశం ఉన్నట్లు తెలిపారు. మంగళవారం జర్మన్ కాన్సులేట్ జనరల్తో పరిశ్రమల శాఖ మంత్రి గౌతంరెడ్డి భేటీ అయ్యారు.ఏపీ పారిశ్రామికాభివృద్ధి కార్యక్రమాలపై ఏపీఐఐసీ ఎండీ ప్రెజెంటేషన్ ఇచ్చారు. పీఎల్ఐ స్కీమ్ ఇన్సెంటివ్లపై ఏపీటీఎస్ ఎండీ ప్రజెంటేషన్ ద్వారా జర్మన్ ప్రతినిధులకు వివరించారు.