ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం వైయస్ జగన్
అమరావతి: పాదయాత్రలో, ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తానని, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తానని ఇచ్చిన హామీని సీఎం వైయస్ జగన్ నెరవేరుస్తూ ఇవాళ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. సీపీఎస్ విధానం రద్దు చేసి జీపీఎస్కు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల కోసం ఏపీ ప్రభుత్వం కొత్త పింఛన్ విధానం తీసుకొస్తోంది. ఏపీ గ్యారెంటెడ్ పెన్షన్ స్కీం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సీపీఎస్ స్థానంలో జీపీఎస్ గ్యారెంటీ పెన్షన్ స్కీం బిల్లు ముసాయిదాను ఇవాళ కేబినెట్ భేటీలో ఆమోదించింది. ఉద్యోగుల భద్రత కోసం సీపీఎస్ స్థానంలో ఏపీ జీపీఎస్ బిల్లు తీసుకొచ్చినట్లు ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ తరువాత వచ్చే 50 శాతం ఫించనకు తగ్గకుండా, డీఏ క్రమంగా పెరిగేలా కొత్త విధంగా కొత్త బిల్లును రూపొందించారు. గ్యారెంటెడ్ పెన్షన్ బిల్ 2023 పేరుతో బిల్లు ముసాయిదాను కేబినెట్ ఆమోదించింది. కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి చెల్లుబోయిన విలేకరులకు వివరించారు. మొత్తం 63 అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.
మంత్రివర్గం తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు:
జీపీఎస్ ద్వారా ఉద్యోగలకు ఊరట:
– రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.
– కొత్తగా జీపీఎస్ విధానానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం
– సీపీఎస్ ఉద్యోగులకు ఊరటనిచ్చేలా ప్రభుత్వ నిర్ణయం.
– జీపీఎస్ ద్వారా ఆఖరు నెలజీతంలో 50శాతం పెన్షన్, ప్రతి ఆరునెలలకొకసారి కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న డీఏ మరియూ డీఆర్ల మాదిరగానే జీపీఎస్ పెన్షనర్లకు కూడా డీఆర్ వర్తింపు.
– రాష్ట్ర భవిష్యత్తును, ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని జీపీఎస్ను తీర్చిదిద్దిన ప్రభుత్వం.
– సీపీఎస్తో పోలికే లేకుండా జీపీఎస్ విధానం.
– రిటైర్డ్ ఉద్యోగులకు పూర్తి భద్రత నిచ్చేలా నిర్ణయాలు.
– దేశానికి మార్గనిర్దేశంలా నిలవనున్న జీపీఎస్ విధానం.
– ప్రభుత్వానికీ, ఉద్యోగులకూ ఉభయ ప్రయోజనకరంగా జీపీఎస్ విధానం.
కొత్త విధానం ఎందుకు? అన్నదానిపై కేబినెట్లో చర్చ:
– సీïపీఎస్ రద్దుచేస్తూ సంతకంపెట్టాలంటే అది నిమిషం పని.
– కాని ప్రత్యామ్నాయాలపై ప్రభుత్వం ఎందుకు సుదీర్ఘ కసరత్తు.
– ఓపీఎస్ను మళ్లీ అమల్లోకి తెస్తే భవిష్యత్తు తరాలపై దాని ప్రభావం.
– ఇవ్వాల్సిన పెన్షన్లు మొత్తం ఉద్యోగుల జీతాలను కూడా దాటేసి మోయలేని స్థాయికి చేరుకునే పరిస్థితి.
– అదే ఓపీఎస్ మరియు సీపీఎస్ పద్ధతుల్లో చూస్తే 2041నాటికి బడ్జెట్లో రూ.65,234 కోట్లు పెన్షన్లు రూపేణా చెల్లించాల్సి వస్తుంది.
– రుణాలపై చెల్లింపులతో కలుపుకుని రాష్ట్ర సొంత ఆదాయంలో ఇది 220 శాతానికి చేరుకుంటుంది.
– 2070 నాటికి ఈ చెల్లింపులు సుమారు రూ.3,73,000 కోట్లవుతుంది.
– ఏదోఒక దశలో ఈ మోయలేని భారాన్ని తట్టుకోలేక 2003 మాదిరిగానే మళ్లీ ఓపీఎస్ను రద్దుచేయాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు మళ్లీ చాలీచాలని పెన్షన్ విధానాన్ని తీసుకురావాల్సి వస్తుందంటూ కేబినెట్లో చర్చ.
ఇప్పుడున్న సీపీఎస్ విధానంపైనా వివరాలు తెలుసుకున్న కేబినెట్.
– సీపీఎస్ విధానం 01–09–2004 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగులకు వర్తింపు.
– ప్రభుత్వ ఉద్యోగులు తమ బేసిక్లో 10శాతం జీతాన్ని, పెన్షన్ ఫండ్కు బదిలీచేయాలి. అంతే మొత్తాన్ని ప్రభుత్వం ఇస్తుంది.
– రిటైర్ అయిన తర్వాత కార్పస్లో 60శాతాన్ని ఉద్యోగి తీసుకోవచ్చు. 40 శాతం సొమ్ము యాన్యుటీ పెన్షన్ స్కీంలో పెట్టుబడిగా పెట్టాలి.
– ఇదంతా మార్కెట్తో లింక్ అయి ఉంటాయి.
– సీపీఎస్ పెన్షన్లో పూర్తి అనిశ్చితి ఉంటుంది. మార్కెట్లో పరిస్థితులు ప్రకారం హెచ్చుతగ్గులు ఉంటాయి.
– అంటే రావాల్సిన పెన్షన్కు గ్యారెంటీ ఉండదు.
– బేసిక్ శాలరీలో 20.3శాతమే పెన్షన్గా వచ్చే అవకాశం. కాని, ఇదికూడా వడ్డీరేట్లపై ఆధారపడి ఉంటుంది.
జీపీఎస్ ప్రకారం...
– జీపీఎస్అయితే... పెన్షన్కు పూర్తి గ్యారెంటీ ఉంటుంది.
– సీపీఎస్లానే ఉద్యోగి 10శాతం ఇస్తే, దానికి సమానంగా ప్రభుత్వం ఇస్తుంది.
– రిటైర్ అయ్యేముందు చివరి శాలరీలో బేసిక్లో 50శాతం పెన్షన్గా అందుతుంది. సీపీఎస్తో పోలిస్తే జీపీఎస్ అందే పెన్షన్ 150శాతం అధికం.
– అలాగే ద్రవ్యోల్బణాన్ని, పెరిగే ధరలను దృష్టిలో ఉంచుకుని– కేంద్ర ప్రభుత్వం ప్రతి ఆరునెలలకోసారి ప్రకటించే డీఏలను పరిగణలోకి తీసుకుని ఏడాదికి రెండు డీఆర్లు ఇస్తారు.
– అంటే రిటైర్ అయిన వ్యక్తి... చివరి నెలబేసిక్ జీతం రూ.1 లక్ష ఉంటే.. అందులో రూ.50వేలు పెన్షన్గా వస్తుంది. ఏడాదికి 2 డీఆర్లతో కలుపుకుని ఇది ప్రతిఏటా పెరుగుతూ పోతుంది.
– 62 సంవత్సరాలకు రిటైర్ అయ్యే వ్యక్తి మరో ఇరవై ఏళ్ల తర్వాత అంటే.. రిటైర్ అయిన ఆ ఉద్యోగికి 82 ఏళ్లు వచ్చేసరికి జీపీఎస్ద్వారా పెన్షన్ రూ. 1,10,000 కి చేరుతుంది.
– దీంతో రిటైర్ అయిన ఉద్యోగి జీవన ప్రమాణాలను కాపాడినట్టు అవుతుంది.
– వారి జీవనవిధానానికి దెబ్బలేకుండా, సంతోషంగా ఉండేలా ఈ రక్షణ చర్యలను జీపీఎస్లో తీసుకున్నారు.
– సీపీఎస్లో ఇలాంటి వెసులు బాటే లేదు.
– కొన్ని రాష్ట్రాల్లో తిరిగి ఓపీఎస్ తీసుకువస్తున్నామని ఆయా ప్రభుత్వాలు వెల్లడించాయి. కాని, ఇది అమల్లోకి రాలేదు. ఏంచేయాలా? అని మల్లగుల్లాలు పడుతున్నాయి.
– రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన జీపీఎస్ దేశానికి మార్గనిర్దేశం చేయబోతోంది.
– ప్రభుత్వ ఉద్యోగులకు మంచి చేయాలనే ఉద్దేశంతో రెండున్నరేళ్లపాటు కసరత్తు చేసి.. వారికి మంచి చేసే నిర్ణయాలు తీసుకున్నాం.
– రాష్ట్ర ప్రభుత్వానికీ, ఉద్యోగులకు ఉభయతారకంగా మేలు జరిగేలా అన్ని రకాల సమతుల్యతను పాటించేలా ఈ నిర్ణయం తీసుకున్నాం.
– మంచి సానుకూల దృక్పథంతో ప్రభుత్వం ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంది.
– ఉద్యోగులకు మంచి చేయాలన్న ఉద్దేశంతో ఇంతకాలం దీనిపై ఆలోచించి కసరత్తు చేశాం:
– ప్రభుత్వం ఆలోచించే ప్రతి నిర్ణయం కూడా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ఇప్పుడున్నవారి యోగక్షేమాలను కూడా దృష్టిలో ఉంచుకుని తీసుకుంటున్నాం:
– ఈ రెండు కోణాలను బాలెన్స్ చేస్తూ... జీపీఎస్ను తీసుకు వచ్చాం:
– 2070 నాటికి జీపీఎస్ వల్ల రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన డబ్బు క్రమంగా పెరుగుతూ అప్పటికి రూ.1,33,506 కోట్లుకు చేరుకుంటుంది.
– ఇందులో రూ.1,19.520 కోట్లు– ప్రభుత్వమే, బడ్జెట్ నుంచి భరించాల్సి వస్తుంది.
మేనిఫెస్టోలో మరో హామీ అమల్లోకి:
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్.
– 2014 జూన్ 2 నాటికి 5ఏళ్ల సర్వీసు ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులు అందరికీ వర్తింపు.
– ఈ కటాఫ్ డేట్కు 10 ఏళ్లు ఉండాలని అధికారులు సిఫార్సు చేస్తే.. దాన్ని ఐదేళ్లకు తగ్గిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం.
– దీంతో మేనిఫెస్టోలో పెట్టిన హామీల్లో 99.5% శాతం అమలు చేసినట్టు అవుతుంది.
– శాఖల వారీగా ఉద్యోగులను గుర్తించి, వారిని ఖరారు చేసే ప్రక్రియ నడుస్తోంది.
అన్ని జిల్లాకేంద్రాల్లోని ఉద్యోగులకు ఒకేలా హెచ్ఆర్ఏ:
– అన్ని జిల్లాకేంద్రాల్లో 16శాతం హెచ్ఆర్ఏ వర్తింపు చేస్తూ కేబినెట్ ఆమోదం
– ప్రస్తుతం సంబంధిత జిల్లాల్లో అందుకుంటున్న హెచ్ఆర్ఏ 12 «శాతం పెంపు.
–01–01–2022 నుంచి డీఏ, డీఆర్ 2.73శాతం ఇచ్చేందుకు కేబినెట్ఆమోదం.
– దీనివల్ల ప్రభుత్వంపై నెలకు రూ.200 కోట్ల అదనపు భారం.
– 12వ పీఆర్సీ ఏర్పాటుకు కేబినెట్ఆమోదం.
– పే రివిజన్ కమిషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం.
– ప్రతి మండలానికి రెండు జూనియర్ కాలేజీలు.
– ప్రతి మండలంలో జనాభా భారీగా ఉన్న రెండు పట్టణాలు లేదా గ్రామాలను ఎంపిక చేసుకుని అక్కడ హైస్కూళ్లను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేయాలి.
– ఇందులో ఒకటి ప్రత్యేకంగా బాలికలకోసం, రెండోది కో– ఎడ్యుకేషన్ కోసం.
– ఇది ప్రభుత్వ తీసుకున్న విధానం. దీన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలి.
దీంట్లో భాగంగా.. చిత్తూరు జిల్లా సొదుంలో బీసీ బాలికల గురుకుల కళాశాలలో రెండు, శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస బీసీ బాలికల గురుకుల పాఠశాలలో రెండు పోస్టుల మంజూరుకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి.
– రాష్ట్రంలో ఆధార్ గుర్తింపు కార్డుకు చట్టబద్ధత.
– చట్ట సవరణకు కేబినెట్ఆమోదం.
– ఆంధ్రప్రదేశ్ ఆధార్ ఆర్డినెన్స్ – 2023కు ఆమోదం తెలిపిన కేబినెట్.
– ఇప్పటికే 16 రాష్ట్రాల్లో ఈ మేరకు చట్టం.
– డీబీటీ కింద దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా నగదును లబ్ధిదారుల ఖాతాల్లో వేశాం.
– కాని,ఆధార్ను లీగర్ఐడెంటిటీగా గుర్తించే చట్టాన్ని ఏపీ చేయకపోవడంల్ల ఎస్జీటీ పరామీటర్స్లో పరిగణలోకి తీసుకోవడంలేదు.
– దీనికోసం ఆధార్ను చట్టబద్ధమైన గుర్తింపుకార్డుగా పరిగణించేందుకు కేబినెట్ అంగీకారం.
– రైలు ప్రమాద ఘటన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను మంత్రివర్గానికి వివరించిన అధికారులు.
– గాయపడ్డవారికి అత్యాధునిక వైద్య చికిత్సఅందించామని వెల్లడి.
– 50 అంబులెన్సులను తరలించాం.
– అక్కడి బాధితులకు, క్షతగాత్రులకు సేవలు అందించడానికి ఈ అంబులెన్సులు కూడా వినియోగించాం.
– రాష్ట్ర ప్రభుత్వం చర్యలను హర్షిస్తూ ఆమోదం తెలిపిన మంత్రివర్గం.
– 2017– డెఫ్ ఒలింపిక్స్ టెన్నిస్లో మిక్స్డ్ డబుల్స్లో కాంస్య పతక విజేత, ఇండియన్ డెఫ్ టెన్నిస్ కెప్టన్ కుమారి షేక్ జాఫ్రిన్(కర్నూలు జిల్లా)కు సహకారశాఖలో డిప్యూటీ రిజిస్ట్రార్గా గ్రూప్–1 సర్వీసు కింద జోన్ –4లో నియామకం. కుమారి జాఫ్రిన్ నియామకానికి ఆమోదం తెలిపిన మంత్రిమండలి.
– దీనికోసం జోన్ 4 లో సూపర్ న్యూమరరీ పోస్టు మంజూరుకు కేబినెట్అంగీకారం.
– 28.35 ఎకరాల చిత్తూరు డైరీ భూములను అమూల్కు లీజుకు ఇచ్చేందుకు కేబినెట్అంగీకారం.
–99 ఏళ్లపాటు లీజు.
– చిత్తూరు డెయిరీని పునరుద్ధరించాలన్నది ఎన్నో ఏళ్లకల.
– ఈ కలను నిజం చేస్తూ తిరిగి పునరుద్ధరిస్తున్నాం.
– త్వరలోనే దీనికి శంకుస్థాపన కూడా చేయబోతున్నాం.
– పాడిరైతులకు బాగా మేలు జరుగుతుంది.
– ఆయా కుటుంబాల్లో ఆర్థిక సుస్థిరత ఏర్పడుతుంది.
– ప.గో.జిల్లా నర్సాపురంలో ఏర్పాటుచేయనున్న ఫిషరీస్ యూనివర్శిటీలో 65 పోస్టుల మంజూరుకు కేబినెట్ఆమోదం.
– నర్సాపురం ఫిషరీస్ సైన్స్ కాలేజీలో 75 పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం.
– ఇది రాష్ట్రంలో రెండో ఫిషరీస్ సైన్స్ కాలేజీ.
– సైన్స్ కాలేజీ నిర్మాణం వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి. నిరంతరం సమీక్ష చేయాలన్న సీఎం.
– ఈ కాలేజీ ద్వారా ఆక్వా సాగు ప్రాంతంలో నిపుణులైన మానవవనరులు అందుబాటులో ఉంటాయి.
– విశాఖపట్నంలోని ప్రభుత్వ మానసిక చికిత్సాలయంలో నూతనంగా అడోలసెంట్ అండ్ చైల్డ్ సైకియాట్రి డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయడంతో పాటు, చైల్డ్ సైకియాట్రిలో ఒక సూపర్ స్పెషాలిటీ యూనిట్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం.
వీటిలో భాగంగా 11 పోస్టుల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్.
– దీంతో వివిధ మానసిక సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు అందనున్న సూపర్ స్పెషాలిటీ సేవలు.
– కడప మానసిక వైద్యశాలలో కొత్తగా 116 పోస్టులు మంజూరుకు కేబినెట్ అంగీకారం.
– వచ్చే ఏడాది మరో మూడు మెడికల్ కాలేజీలు రెడీ. (పులివెందుల, పాడేరు, ఆదోని).
– ఈ మూడు కాలేజీల్లో 2118 పోస్టులను మంజూరుకు కేబినెట్ అంగీకారం.
– ఒక్కో కాలేజీకి 706 పోస్టులు.
– రాజమండ్రి, విజయనగరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో ఈ ఏడాదే తరగతులు.
– కేవలం 6 నుంచి 9 నెలల వ్యవధిలో అత్యంత వేగంగా పనులు చేసి.. కాలేజీలను సిద్ధంచేశాం.
– మెడికల్ కాలేజీల ఏర్పాటువెనుక సీఎం కృషిని అభినందించిన కేబినెట్.
– 2019తో పోలిస్తే పీజీ సీట్ల సంఖ్యకూడా రెట్టింపు అయ్యింది.
– వైద్య విధాన పరిషత్ చట్టానికి సవరణలు చేస్తూ కేబినెట్ నిర్ణయం.
ఆంధ్రప్రదేశ్ వైద్య విధానపరిషత్ యాక్ట్ –1986ను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం.
స్వయంప్రతిపత్తిగా ఉన్న ఏపీ వైద్యవిధానపరిషత్ అటానమస్ను రద్దు చేయడంతో పాటు ఏపీవీవీపీని.. డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ ప్రభుత్వ శాఖగా మార్పు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం.
– సెకండరీ వైద్య సేవలు అందిస్తున్న వైద్య విధాన పరిషత్.
– ఇతర ప్రభుత్వ ఉద్యోగుల లానే వీరికి జీతాలు.
– అలాగే వీరికి ఉద్యోగ భద్రత కూడా కల్పిస్తున్న ప్రభుత్వం.
– 010 హెడ్ ఆఫ్ అక్కౌంట్ ద్వారా జీతాలు చెల్లింపులు.
– రాజానగరం అసెంబ్లీ పరిధిలో సీతానగరం పీహెచ్సీని సీహెచ్సీగా మార్చనున్న ప్రభుత్వం.
– ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సీహెచ్సీ ఉండే విధానానికి అనుగుణంగా ఏర్పాటు.
– అలాగే ప్రతి రెవిన్యూ డివిజన్లోకూడా ఒక ఏరియా ఆస్పత్రి, అలాగే ప్రతిజిల్లాలో మెడికల్ కాలేజీ ఉండే విధానం అమలు చేస్తున్న ప్రభుత్వం.
ఉద్దానం కిడ్నీ ఆస్పత్రిల్లో 41 మంది స్పెషాల్టీ, సూపర్ స్పెషాల్టీ వైద్యులను రెగ్యులర్ పద్ధతిలో నియామకానికి కేబినెట్ అంగీకారం.
ఉద్దానం ఆస్పత్రిని సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీగా తీర్చిదిద్దనున్న ప్రభుత్వం.
– జూన్ 15న, జిల్లా స్ధాయిలో జూన్ 17, రాష్ట్ర స్ధాయిలో జూన్ 20న జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమం.
– 2023 పదోతరగతి, ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో అత్యుత్తమ ప్రతిభ కనపర్చిన విద్యార్ధులను సన్మానించి స్టేట్ ఎక్స్లెన్స్ అవార్డ్స్ 2023 లను అందించాలన్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం.
మూడు దశలలో ఉత్తమ ప్రతిభ కనపర్చిన విద్యార్ధులను సన్మానించాలని నిర్ణయం.
నియోజకవర్గ స్ధాయిలో ఉత్తమ ప్రతిభ కనపర్చిన విద్యార్ధులను జూన్ 15న, జిల్లా స్ధాయిలో జూన్ 17, రాష్ట్ర స్ధాయిలో జూన్ 20న అవార్డులు అందజేయాలని నిర్ణయం.
– జూన్28 నుంచి అమ్మ ఒడి. పదిరోజులపాటు కార్యక్రమాలు.
– జూన్12న జగనన్న విద్యాకానుక అమలు.
– ప్రతి విద్యార్థికీ విద్యాకానుక కింద కనీసంగా రూ.2200లు ఖర్చు చేస్తున్నాం.
– క్వాలిటీలో ఎక్కడా రాజీ ఉండకూడదు.
– విద్యాకానుకలో ఏ లోపం ఉన్నా వెంటనే రిటర్న్ చేసి కొత్తవి తెప్పించాలి.
– విద్యాకానుక కింద దాదాపుగా రూ.1056 కోట్లు ఖర్చుచేస్తున్నాం.
– విద్యాకానుక కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మంత్రులు ఇందులో పాల్గొంటారు.
– ప్రతి మండలంలో ఈ కార్యక్రమం.
– నాడు –నేడు పూర్తిచేసుకున్న స్కూళ్లు, కాలేజీల్లో ఐఎఫ్పీ ప్యానెల్సె పెట్టిన చోట్ల వాచ్మెన్ల నియామకం.
– ఇందులో భాగంగా 476 జూనియర్ కాలేజీల్లో వాచ్మెన్లు నియామకం.
– రెవిన్యూ డివిజనల్ స్ధాయిలో కూడా డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ నియామకం.
– స్కూళ్లో అమలవుతున్న కార్యకలాపాల సమగ్ర పర్యవేక్షణకు ఏర్పాటు.
– కేబినెట్ ఆమోదం.
– ప్రభుత్వ స్కూలు పిల్లలకు టోఫెల్ ఎగ్జామ్స్.
ఈ పరీక్షలు నిర్వహించేందుకు ఈటీఎస్తో ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వం.
ఆమోదం తెలిపిన మంత్రివర్గం.
3వ తరగతి పిల్లల నుంచి టోఫెల్ఎగ్జామ్స్.
టోఫెల్ ప్రైమరీ ( 3–5 తరగతులకు), టోఫెల్ జూనియర్ పరీక్ష (6–10 తరగతులకు).
వీరికి సర్టిఫికెట్ ఇస్తారు.
పిల్లలు ఉత్తమ ప్రతిభ చూపితే..వారి ఇంగ్లిషు టీచర్ను 3 రోజుల శిక్షణకోసం అమెరికాలోని ప్రిన్సెటన్కు పంపిస్తారు.
విద్యార్థులను గ్లోబల్ సిటిజన్స్గా తీర్చిదిద్దడానికి చర్యల్లో మరో అడుగుగా పేర్కొన్న మంత్రివర్గం.
ఇప్పటికే ట్యాబులు ఇచ్చారు, ఐఎఫ్పీలు పెడుతున్నారు.
సీబీఎస్ఈ సిలబస్ను తీసుకువచ్చారు. ఇంగ్లిషు ల్యాబులు నెలకొల్పారు.
ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు ఇచ్చారు, అంగన్వాడీల నుంచి అన్ని స్కూళ్లలో ఇంగ్లిషు మీడియంను తప్పనిసరి చేశారు.
బైలింగువల్ టెక్ట్స్బుక్స్ను కూడా తీసుకు వచ్చారు, సబ్జెక్ట్ టీచర్ విధానంలో భాగంగా ఇంగ్లిషు టీచర్లు అందుబాటులోకి వచ్చారు.
– రాష్ట్రంలో నాలుగు ఐఆర్ బెటాలియన్లు ఏర్పాటులో భాగంగా ప్రతి బెటాలియన్కు 980 పోస్టుల చొప్పున మొత్తం 3920 పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం.
శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం ఎస్.ఎం.పురం, చిత్తూరు జిల్లా చిత్తూరు పట్టణం, ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం అన్నంగి, రాజమహేంద్రవరం పట్టణంలోనూ ఏర్పాటు కానున్న నాలుగు ఐఆర్ బెటాలియన్లు.
– గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్అమ్మెనియా పాలసీకి కేబినెట్ ఆమోదం.
– ఏడాదికి 0.5 మిలియన్ మెట్రిక్ టన్నుల హైడ్రోజన్, 2 మిలియన్ మెట్రిక్ టన్నుల అమ్మోనియాను వచ్చే ఐదేళ్లలో ఉత్పత్తిచేయాలన్నది ఈ పాలసీ లక్ష్యం.
– ఈ ఉత్పత్తిచేసే పరిశ్రమల స్థాపనద్వారా కూడా గణనీయంగా పెరగనున్న పారిశ్రామిక ప్రగతి.
– దాదాపు 12వేలమందికి ఉద్యోగాలు
– అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో 300 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టును ఏర్పాటుచేయనున్న రెన్యూ వోయేమాన్ పవర్ ప్రై.లిమిటెడ్.
– దాదాపు రూ.1800 కోట్ల పెట్టుబడులు.
– 300 మందికి ఉద్యోగాలు.
– ఆమోదం తెలపిన రాష్ట్ర మంత్రివర్గం.
– మండల కేంద్రం నుంచి ప్రతి గ్రామ పంచాయతీకి ఆప్టిక్ ఫైబర్ కేబుల్.
డిజిటల్ లైబ్రరీలు, గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, స్కూళ్లు, పీహెచ్సీలు న్నింటికీ హై బ్యాండ్ విడ్త్.
మారుమూల ప్రాంతాల్లోకి కూడా అందుబాటులోకి రానున్న 5జి సేవలు.
దీనికోసం ఏపీఎస్ఎఫ్ఎల్కు రూ.445.7 కోట్ల రుణం తీసుకునేందుకు కేబినెట్ అంగీకారం.
– రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న దేవాలయాలకు మినహాయింపులు.
వీటి నిర్వహణలో తగ్గనున్న ప్రభుత్వ జోక్యం.
ఇకపై సులభంగా రోజువారీ కార్యకలాపాలను నిర్వహించేందుకు వెసులుబాటు.
ఐదేళ్లపాటు ఇది అమల్లో ఉంటుంది.
బిల్లుకు ఆమోదం తెలిపిన రాష్ట్ర మంత్రివర్గం
ఇదే సమయంలో పారదర్శకతను పాటించేందుకు ఫిర్యాదులు వస్తే.. వాటిని విచారించి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
దేవాదాయ శాఖ భూముల పరిరక్షణకు చర్యల్లో భాగంగా చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం.
ఆక్రమణలు తొలగించేందుకు, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి వీలుగా సవరణ.
కాలపరిమితితో సంబంధం లేకుండా ఇదివరలో ఇచ్చిన ఉత్తర్వుల పరిశీలనకూ ప్రభుత్వానికి అధికారాలు.
– ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ సెక్షన్ 5 ను (రోడ్ ట్రాన్స్ఫోర్ట్ కార్పొరేషన్ ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసులోకి విలీనం చేస్తూ ) సవరించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి.
– గుంటూరు జిల్లా తాడేపల్లిలో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(ఎన్సీడీసీ) సంస్ధ ఏర్పాటుకు 2 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలన్న ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం.
– వైయస్సార్ కడప జిల్లా సీ.కె.దిన్నె మండలం మామిళ్లపల్లెలో 3.70 ఎకరాలు, కడప మండలం చిన్నచౌక్లో 3.70 ఎకరాల ప్రభుత్వ భూమిని కడప జిల్లా బెస్త సంఘానికి కేటాయించాలన్న నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదం.
– అనంతపురం జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం గ్రామంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు 10 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం.
గతంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ , ఇన్డైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కొటిక్స్ సంస్ధకు కేటాయించిన 10 ఎకరాల స్ధలాన్ని అదే ప్రాంగణంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయడానికి అనుకూలంగా మార్పు చేస్తూ నిర్ణయం.
– ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం, చేవూరు గ్రామంలో 40 సెంట్ల ప్రభుత్వ స్ధలాన్ని ఏపీ మారిటైం బోర్డుకు రామాయపట్నం నాన్ మేజర్ పోర్టు కోసం బదలాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం.
– ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం, రావూరు గ్రామంలో 9.46 ఎకరాల ప్రభుత్వ స్ధలాన్ని ఏపీ మారిటైం బోర్డుకు రామాయపట్నం నాన్ మేజర్ పోర్టు కోసం బదలాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం.
– ఏర్పేడు మండలం వికృతిమాలలో 15.15 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వామి నారాయణ్ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటుకు కేటాయించాలన్న ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం.