పైడితల్లికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి బొత్స దంపతులు

15 Oct, 2019 16:32 IST

విజయనగరం: విజయనగరంలో పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరం వైభవంగా సాగుతోంది. మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ దంపతులు ప్రభుత్వ తరుఫున పైడితల్లి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. సిరిమానోత్సవం సందర్భంగా అమ్మను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.


Read Also: వైయస్‌ జగన్‌ మంచితనం వల్లే వర్షాలు