ఏపీలో పెట్టుబడులకు ప్రభుత్వం ఆహ్వానిస్తోంది
13 Aug, 2019 12:16 IST
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం ఆహ్వానిస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారిశ్రామికవేత్తలకు అనుమతిస్తామని చెప్పారు. ఉత్తరాంధ్ర, విశాఖలో పర్యాటక అభివృద్ధికి పెట్టుబడులు పెట్టండి అని కోరారు. తీరం వెంట పర్యాటక పెట్టుబడులకు అనుకూలంగా ఉందని చెప్పారు.