ఆక్వా రైతులకిచ్చే విద్యుత్ రాయితీలను పొడిగిస్తామని విద్యుత్, అటవీ, పర్యావరణ, సైన్స్అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు.ఎస్సీ,ఎస్టీలకు ఉచితంగా 200 యూనిట్లు ఇస్తామని తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణా అరికడతామని వెల్లడించారు. గురువారం సచివాలయంలోని ఆయన ఛాంబర్లోకి వేదమంత్రోచ్ఛరణలతో అడుగుపెట్టిన ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వన్యప్రాణి సంరక్షణకు సంబంధించిన రెండు కమిటీల ఫైల్స్పై సంతకాలు చేశారు.