తూర్పుగోదావరి: అనుమతులు లేని బోట్లపై చర్యలు తీసుకుంటామని టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం వద్ద గోదావరిలో జరిగిన బోటు ప్రమాద ప్రాంతాన్ని మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, ధనలక్ష్మి, ఉదయభాస్కర్లు పరిశీలించారు. ఈ మేరకు మంత్రి అవంతి మాట్లాడుతూ.. రెస్క్యూ ఆపరేషన్ను పూర్తిస్థాయిలో చేపట్టాం. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక బృందాలు గాలింపు చర్యల్లో పాల్గొంటున్నాయి. అనుమతులు లేని బోట్లపై చర్యలు తీసుకుంటాం. హైవే పెట్రోలింగ్ జరిగినట్లే గోదావరిలో బోటు పెట్రోలింగ్ జరగాలన్నారు.