వారం రోజుల్లో ‘పది’ పరీక్షల షెడ్యూల్ ప్రకటిస్తాం
22 Jan, 2021 16:46 IST
విజయవాడ: ఈ ఏడాది తప్పనిసరిగా పదో తరగతి పరీక్షలు ఉంటాయని, మరో వారం రోజుల్లో టెన్త్ ఎగ్జామ్ షెడ్యూల్ ప్రకటిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈ మేరకు మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ.. మే నెలలో టెన్త్ పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది 11 పేపర్లా..? లేక 6 పేపర్లా..? అనే దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు.