అసెంబ్లీ: చంద్రబాబును నమ్మితే చివరకు గోచీ కూడా ఉంచడని ఇరిగేషన్ శాఖ మంత్రి డాక్టర్ అనిల్కుమార్ యాదవ్ అన్నారు. రాష్ట్ర ఖజానాను సర్వం నాకేసి ఇప్పుడు కొత్తగా జోలె పట్టుకొని రైతులను ఇంకా మోసం చేస్తున్నాడని మండిపడ్డారు. అసెంబ్లీలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు పసుపు కుంకుమ పేరుతో రాష్ట్ర ఖజానాను సర్వం నాకేశారు. కాపు, బీసీ ఇలా ఏ కార్పొరేషన్ చూసినా ఖజానాను నాకేసిన టీడీపీ నేతలు ఇవాళ కార్పొరేషన్ల గురించి మాట్లాడడం సిగ్గుచేటు. ఎస్సీ బిల్లుపై చర్చ జరుగుతుంటే అడ్డుపడుతున్నారు. చంద్రబాబు ఏడుపు ముఖంతోనే ఐదేళ్లు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించాడు. నవ్వలేని రోగం చంద్రబాబు, ఆయన పార్టీ ఎమ్మెల్యేలకూ ఉంది. రాష్ట్రాన్ని మొత్తం దోచుకున్నారు కొత్తగా జోలె పట్టుకుంటున్నారు. తిరుపతి, సెక్రటేరియట్లో పెట్టిన హుండీల్లోని డబ్బులు ఎక్కడకు పోయాయో తెలియదు. కొత్తగా జోలె పట్టుకొని రైతులను ఇంకా మోసం చేస్తున్నారని మంత్రి అనిల్ మండిపడ్డారు.