అమరావతి: పరీక్షా కేంద్రాలు తెలుసుకునేందుకు యాప్ ఏర్పాటు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. హల్ టికెట్లపై క్యూ ఆర్ కోడ్ ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు టెన్త్ పరీక్షలు జరగనున్నాయని తెలిపారు. మార్చి 4 నుంచి 23 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయని వెల్లడించారు. ఇంటర్లో గ్రేడింగ్తో పాటు మార్కులు కూడా ఇస్తామని తెలిపారు. నూజివీడు ట్రిపుల్ ఐటీ ఘటనపై కమిటీ నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.