కర్నూలుః విద్యాశాఖలో సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి పెనుమార్పులు తీసుకువచ్చారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలు పాటించని స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు ఫీజుల నియంత్రణ తప్పక పాటించాలని ఆదేశించారు. విద్యను వ్యాపారం చేస్తే సహించం అని తెలిపారు.