తాడేపల్లి: సీఎం వైయస్ జగన్ మాటల మనిషి కాదని.. చేతల మనిషి అని పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి ప్రశంసించారు. ముఖ్యమంత్రి ముందు చూపు వల్ల ఈ రోజు కరోనా టెస్టింగ్ కిట్లు, వెంటిలేరట్లు తయారు చేయగలిగామని పేర్కొన్నారు. దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కరోనా టెస్టింగ్ కిట్లు, వెంటిలేరట్లు తయారు చేస్తున్నామని తెలిపారు. ఈ నెలాఖరు వరకు రాష్ట్రంలో రోజులు 3 నుంచి 4 వేల పరీక్షలు చేసేలా కిట్లు తయారు చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి కరోనా టెస్టింగ్ కిట్లను ప్రారంభించనున్నారని పేర్కొన్నారు. ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు కూడా కిట్లు సరఫరా అవుతాయన్నారు. టీబీ మెషిన్లకు అమర్చుకునేలా కిట్లను తయారు చేస్తున్నామని.. దీనివల్ల త్వరగా టెస్టింగ్ కిట్లను అమర్చుకోవచ్చని వెల్లడించారు.
మొట్టమొదటి ఇండియన్ మేడ్ వెంటిలేటర్లను కూడా విశాఖలో తయారు చేస్తున్నామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన మెడ్టెక్ జోన్కు నిధులిచ్చి సీఎం అందుబాటులోకి తెచ్చారని గుర్తుచేశారు. అలాగే రాష్ట్రంలో పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు లేకండా అన్నిచర్యలు తీసుకుంటున్నామని మంత్రి గౌతమ్రెడ్డి తెలిపారు.